భారత్ – చైనా బలగాల మధ్య లద్దాక్ వద్ద గాల్వన్ లోయలో చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది.
ఈ ఘర్షణలో అమరులైన వీర జవాన్ల పేర్లను భారత సైన్యం విడుదల చేసింది.
మృతుల్లో ఒకరు కల్నల్ కాగా మిగతా వారు నాయిబ్ సుబేదార్, హవల్దార్, సిపాయి హోదా కల్గిన వారు ఉన్నారు.
1. బి.సంతోష్బాబు (కల్నల్) – సూర్యాపేట, తెలంగాణ
2. నాదూరాం సోరెన్ (నాయిబ్ సుబేదార్) – మయూర్బంజ్, ఒడిశా
3. మన్దీప్ సింగ్ (నాయిబ్ సుబేదార్) – పటియాలా, పంజాబ్
4. సత్నం సింగ్ (నాయిబ్ సుబేదార్)- గురుదాస్పూర్, పంజాబ్
5. కె. పళని (హవల్దార్) – మధురై, తమిళనాడు
6. సునీల్ కుమార్ (హవిల్దార్) – పట్నా, బిహార్
7. బిపుల్ రాయ్ (హవిల్దార్) – మేరఠ్ నగరం, ఉత్తర్ప్రదేశ్
సిపాయిలు
8. దీపక్ కుమార్ – రీవా, మధ్యప్రదేశ్
9. రాజేష్ అరంగ్ – బిర్భుం, బంగాల్
10. కుందన్ కుమార్ ఓఝా – సాహిబ్ గంజ్, ఝార్ఖండ్
11. గనేష్ రాం – కాంకేర్, ఛత్తీస్గఢ్
12. చంద్రకాంత ప్రధాన్ – కందమాల్, ఒడిశా
13. అంకుశ్ – హమిర్పుర్, హిమాచల్ప్రదేశ్
14. గుర్విందర్ – సంగ్రూర్, పంజాబ్
15. గుర్తేజ్ సింగ్ – మాన్సా, పంజాబ్
16. చందన్ కుమార్ – భోజ్పూర్, బిహార్
17. కుందన్ కుమార్ – సహస్ర, బిహార్
18. అమన్ కుమార్ – సమస్థిపుర్, బిహార్
19. జైకిశోర్ సింగ్ – వైశాలి, బిహార్
20. గనేశ్ హన్స్దా – ఈస్ట్ సింగ్భూం, ఝార్ఖండ్
ఈ అమరవీరులకు లేహ్లోని ఆర్మీ ఆసుపత్రి వద్ద సైనిక దళాలు గౌరవ వందనం సమర్పించాయి.
అనంతరం వీర సైనికుల పార్ధివ దేహాలను స్వస్థలాలకు తరలిస్తున్నారు.