అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఈ ఘటన జరిగింది.బాణాసంచా తయారీలో ఉపయోగించే రసాయనాలు చాలా ప్రమాదకరమైనవి. వాటిని జాగ్రత్తగా నిర్వహించాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. చాలా బాణాసంచా తయారీ కేంద్రాలలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించరు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేకపోవడం, సరైన వెంటిలేషన్ లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.బాణాసంచా తయారీ ప్రక్రియ గురించి సరైన శిక్షణ లేని కార్మికులు ప్రమాదాలకు కారణం కావచ్చు. రసాయనాలను ఎలా కలపాలి, వాటిని ఎలా నిల్వ చేయాలి అనే విషయాలపై వారికి తగినంత జ్ఞానం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు నాణ్యత లేని లేదా కల్తీ చేసిన ముడి పదార్థాలను ఉపయోగించడం వల్ల రసాయన చర్యలు సరిగా జరగక పేలుళ్లు సంభవించవచ్చు. తయారీలో ఉపయోగించే యంత్రాలు పాతవిగా ఉండటం లేదా వాటికి సరైన నిర్వహణ లేకపోవడం వల్ల అవి పనిచేసేటప్పుడు నిప్పులు లేదా వేడిని పుట్టించవచ్చు. ఇది ప్రమాదానికి దారితీయవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు వివరిస్తున్నారు.
బాణాసంచా తయారీ కేంద్రాల దగ్గర లేదా లోపల కాగితాలు, చెక్కలు వంటి తేలికగా మండే పదార్థాలు ఉంటే.. చిన్న నిప్పురవ్వ పడినా వెంటనే మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. విద్యుత్ వైరింగ్లో సమస్యలు లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల రసాయనాలు వేడెక్కి పేలే అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు.తయారీ, నిల్వ ప్రాంతాలను వేరుగా ఏర్పాటు చేసుకోవాలి. భవనాలు అగ్ని నిరోధక పదార్థాలతో నిర్మించాలి. సులువుగా బయటకు వెళ్లడానికి తగినన్ని నిష్క్రమణ మార్గాలు ఉండాలి. పనిచేసే ప్రదేశంలో తగినంత స్థలం ఉండాలి. రద్దీగా ఉండకూడదు. విద్యుత్ వైరింగ్, ఇతర పరికరాలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. పేలుడు పదార్థాలను నిర్వహించడానికి శిక్షణ పొందిన సిబ్బందిని మాత్రమే నియమించాలి. పని చేసే సమయంలో వ్యక్తిగత రక్షణ పరికరాలు తప్పనిసరిగా ధరించాలి. (అగ్ని నిరోధక దుస్తులు, చేతి తొడుగులు, కళ్లద్దాలు). పేలుడు పదార్థాల తయారీ, నిర్వహణ కోసం నిర్దిష్టమైన, సురక్షితమైన విధానాలను అనుసరించాలి.
అనకాపల్లి జిల్లా(Anakapalle District) కోటవురట్ల మండలం కైలాసపట్నం(Kailashpatnam)లో బాణసంచా తయారీ కేంద్రం(Fireworks manufacturing center)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఎనిమిది మంది కార్మికులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu)దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఘటనపై వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి శ్రీమతి అనితతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ‘‘అగ్నిప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది.’’ అనే విషయాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఘటనపై విచారణ చేసి నివేదించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేశారు.
కాగా అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమింది మంది మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు అప్పికొండ తాతబాబు, సంగరాతి గోవింద్, దాడి రామలక్ష్మి, దేవర నిర్మల, పురంపాప, గుంపిన వేణుబాబు, శానవెల్లి బాబూరావు, చదలవాడ మనోహర్గా గుర్తించారు. వీరంతా కూలి పనికి వచ్చారు. బాధితుల్లో తూర్పుగోదావరి జిల్లకు చెందిన వారి ఎక్కువగా ఉన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు సమయంలో పరిశ్రమలో 15 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.