అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.అయితే ఈసారి 3 వారాలకు పైగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి 8 నెలలు పూర్తికావస్తోంది. అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దాఖలాలు లేవు. గత అసెంబ్లీ సమావేశాల్లో తాత్కలిక బడ్జెట్తో సరిపెట్టాల్సి వచ్చింది. పాత బడ్జెట్నే కొనసాగించారు. ఈ క్రమంలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో తొలుత మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 3 వారాలకు పైగా సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. అనంతరం అసెంబ్లీలో పూర్తిస్తాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 6న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. పనిదినాలు, బడ్జెట్ తేదీలను కేబినెట్ ఖరారు చేయనుంది.
ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి6న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆమోదం తెలపనుంది. అలాగే బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి అనేదానిపై కూడా కేబినెట్లో చర్చించనున్నారు. అయితే ఈసారి 3 వారాలకు పైగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి 8 నెలలు పూర్తికావస్తోంది. అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దాఖలాలు లేవు. గత అసెంబ్లీ సమావేశాల్లో తాత్కలిక బడ్జెట్తో సరిపెట్టాల్సి వచ్చింది. పాత బడ్జెట్నే కొనసాగించారు. ఈ క్రమంలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
పలు బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్
ఈ ఫిబ్రవరిలో జరిగే సమావేశాల్లో 2025 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కనీసం3 వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి….బడ్జెట్తోపాటు ఇతర బిల్లులను సభ ముందుకు తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశాలకు ముందు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. సూపర్ సిక్స్లో భాగంగా మిగిలి పోయిన హామీలపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. త్వరలో ఉచిత బస్సు ప్రయాణం హామీని నెరవేర్చేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ కేబినెట్లో ఈ హామీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకంపై ఇప్పటికే మంత్రుల బృందం కర్ణాటకలో పర్యటించింది. ఫ్రీ బస్ జర్నీ స్కీమ్పై అధ్యయనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.