శాసనసభలో, వెలుపల రామానాయుడుపై లోకేష్ ఆప్యాయత
అమరావతి: ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కేవలం పనిపైనే కాకుండా కాస్త ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని ఇరిగేషన్ మంత్రి లోకేష్ సలహా ఇచ్చారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నిమ్మల జ్వరంతో బాధపడుతున్న విషయాన్ని లోకేష్ ప్రస్తావిస్తూ… రామానాయుడు విశ్రాంతి తీసుకునేలా రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కోరడంతో శాసనసభలో నవ్వుల పువ్వులు విరిశాయి. విశ్రాంతి తీసుకుంటారా లేక సభ నుంచి సస్పెండ్ చేయించమంటారా అంటూ లోకేష్ చమత్కరించారు. ఆ తర్వాత అసెంబ్లీ లాబీల్లో మంత్రి రామానాయుడు ఎదురుపడినపుడు ఆయన ఆరోగ్యంపై లోకేష్ వాకబు చేస్తూ… ఒక చేతికి సెలైన్ ఇంజెక్షన్ పెట్టుకుని నేడు మరో చేతిలో కాగితాలు పట్టుకుని తిరుగుతూనే ఉంటే ఆరోగ్యం ఏం కావాలని ఆప్యాయంగా ప్రశ్నించారు. నిన్నటి మీద ఈరోజు ఆరోగ్యం బాగానే ఉంది, అందుకే వచ్చానన్న రామానాయుడు సమాధానమిచ్చారు. మాట వినకుంటే నా యాపిల్ వాచ్ ని మీ చేతికి పెట్టి నిద్రను మానిటర్ చేస్తానని లోకేష్ చెప్పడంతో ఈరోజు సభ అయ్యాక మీ మాట ప్రకారమే విశ్రాంతి తీసుకుంటానని రామానాయుడు అన్నారు.