మాజీ ఎంపీ విజసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. విజయసాయిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (ఏపీ సీఐడీ) నోటీసులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్ల్లో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకున్న కేసులో విజయసాయిరెడ్డిని కూడా నిందితుడిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. విజయసాయిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణికి సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. బుధవారం ఉదయం విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ (కేఎస్పీఎల్), కాకినాడ సెజ్ (కేసెజ్)లలో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను బలవంతంగా స్వాధీనం చేసుకున్నట్లుగా విజయసాయిరెడ్డితో పాటు తదితరులపై ఆరోపణలు వచ్చాయి. తనను బెదిరించడం ద్వారా మెజారిటీ వాటాను అరబిందో ఫార్మాకు బదిలీ చేయమని బలవంతం చేశారనే కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి, ఇతరులు ఆడిట్లను తారుమారు చేశారని, నకిలీ నివేదికలు తయారు చేశారని, రాజకీయ అధికారాన్ని ఉపయోగించి కేఎస్పీఎల్, కేసెజ్లలో తన వాటాలను గణనీయంగా తక్కువ ధరలకు విక్రయించేలా బలవంతం చేశారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే కేవీ రావు ఫిర్యాదు మేరకు పోర్టు వాటాల అక్రమ బదిలీపై సాయిరెడ్డితోపాటు మొత్తం ఐదుగురిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ-1 విక్రాంత్ రెడ్డి,ఏ-2 విజయసాయిరెడ్డి, ఏ-3 శరత్ చంద్రారెడ్డి, ఏ-4 శ్రీధర్, ఏ-5గా అరబిందో రియాల్టీ ఇన్ఫ్రా ఉన్నారు. అయితే ఈ కేసు నమోదైన తర్వాత విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు, అరబిందో ఫార్మా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పెనక శరత్ చంద్ర రెడ్డి, వైసీపీ ఎంపీ వైసీపీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిలపై సీఐడీ లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. దోపిడీ, మోసం, ఫోర్జరీ, ఇతర నేరాలకు సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న వారు దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్టుగా తెలిసింది.
అయితే ఈ వ్యవహారంలో ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ రంగంలోకి దిగింది. ఇందుకు సంబంధించి ఈసీఐఆర్ దాఖలు చేసింది. కాకినాడ సీ పోర్టును స్వాధీనం చేసుకోవడంలో మనీలాండరింగ్ జరిగిందని ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు… ఈ ఏడాది జనవరిలో ఆయనను విచారించారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు విజయసాయి రెడ్డిని మనీలాండరింగ్, షేర్ల విలువ తగ్గింపు, వైసీపీ నాయకుల నుంచి వచ్చిన బెదిరింపు ఆరోపణల గురించి ప్రశ్నించారు.
వై.ఎస్.జగన్ పాలనలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ (కేఎస్పీఎల్), కాకినాడ సెజ్ (కేసెజ్)లో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకున్న కేసులో వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.
బుధవారం ఉదయం విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఇద్దిరోజుల క్రితం సీఐడీ అధికారులు విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లినప్పటికీ, అతను అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణికి నోటీసులను అందజేశారు.
ఈ కేసులో విజయసాయిరెడ్డి రెండో నిందితుడు (A2)గా ఉన్నారు, అలాగే జగన్ బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్రెడ్డి ప్రధాన నిందితుడు (A1)గా ఉన్నారు.