చిరంజీవి మహిళా దినోత్సవ సందర్భంగా తన చెల్లెలు అలాగే తన తల్లితో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో భాగంగా చిరంజీవి తన తల్లి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మా ఇంట్లో మా అమ్మకు ఒక సపరేట్ కిచెన్ ఉందని తెలిపారు. ఎప్పుడైనా అమ్మకు మాకు ఏదైనా వంట చేయాలి అనిపిస్తే ఆ కిచెన్ లోనే మాకు నచ్చిన ఆహార పదార్థాలను తయారు చేసి పెడతారని చిరంజీవి తెలిపారు. ఇక మా కంటే కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం అమ్మ వెంటనే కిచెన్ లోకి వాలిపోతుందని చిరు తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ వచ్చాడంటే వాడు ఎంతగానో బయట ఎండకు గాలికి తిరుగుతూ కష్టపడి పోతున్నారని అమ్మ ఫీల్ అవుతూ ఉంటుంది.
మేమంతా ఇక్కడ గొడ్డు చాకిరీ చేసినా కానీ అమ్మ అలా ఫీల్ అవ్వదు కానీ వాడు బయట రాజకీయ పనులలో ఎండలో తిరగడం టీవీలలో ఎక్కువసార్లు చూపించడం వల్ల తాను అలసిపోయాడని అమ్మ ఫీల్ అవుతుందని చిరు తెలిపారు. అందుకే పవన్ కళ్యాణ్ వచ్చాడు అంటే చాలు వెంటనే కిచెన్ లోకి వెళ్లిపోయి తనకు ఎంతో ఇష్టమైన బిర్యాని వండి ఆమె తినిపిస్తుందని వెల్లడించారు.
ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఉంటారు ఏం చేస్తున్నారో అనే విషయాలు మనకు ఎవరికీ సరిగా తెలియవు కానీ కళ్యాణ్ బాబు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నారు అనే విషయాలు మాత్రం అమ్మకు స్పష్టంగా తెలుస్తాయని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన తల్లి ఇద్దరికీ మధ్య ఉన్నటువంటి బాండింగ్ గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మహిళా దినోత్సవం 2025 సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అంజనమ్మ, మెగా సిస్టర్స్ విజయ దుర్గా, మాధవి ముచ్చట్లు పెట్టారు. మెగా బంధాన్ని, మహిళా సాధికారితను చాటి చెప్పేలా చిరంజీవి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. “ఉమ్మడి కుటుంబం, ప్రేమ, ఆప్యాయత, ఈ విలువలు అన్నీ కూడా తమకు అమ్మా నాన్నల నుంచే సంక్రమించాయి. మా నాన్నకు చాలీ చాలని జీతం వచ్చినా కూడా.. ఆ డబ్బుతోనే మా ఫ్యామిలీని పోషించారు. అమ్మ సైడ్ ఫ్యామిలీని కూడా చూసుకున్నారు. అమ్మ సైతం మా నాన్న గారి ఫ్యామిలీని ఎంతో చక్కగా చూసుకునేవారు” అని అన్నారు.
“అలా అప్పటి నుంచే మాకు ఉమ్మడి కుటుంబం, బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు అనేవి తెలిసి వచ్చాయి. అందుకే మేం ఇప్పటికీ కలిసి కట్టుగా ఉంటాం. మేం ప్రేమ, ఆప్యాయతలు, బంధాల విషయంలో అందరి కంటే ధనికులం. ఒక్కో సారి డబ్బు అన్ని సమస్యల్ని తీర్చలేకపోవచ్చు. కానీ, ఓ భుజం తోడుగా ఉంటే వచ్చే ధైర్యం, భరోసా వేరేలా ఉంటుంది” అని చిరంజీవి తెలిపారు.
చిన్నప్పుడు నేను ఎక్కువగా అమ్మతో పాటే ఉండేవాడిని. అమ్మకు సాయంగా అన్ని పనుల్లో తోడుండేవాడిని. నాగబాబు అసలు ఇంట్లో పనులు చేసే వాడు కాదు. ఇక కల్యాణ్ బాబు అంటే అమ్మకి కాస్త ఎక్కువ ఇష్టం. రాజకీయ నిరసనలు చేసి బాగా కష్టపడుతున్నాడు.. బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి ఇంటికి వచ్చినప్పుడు రకరకాల వంటకాలు వండి పెడుతుంటారు. కల్యాణ్ బాబు ఎక్కడున్నాడో ఇంట్లో ఎవ్వరికీ తెలిసినా తెలియకపోయినా అమ్మకి మాత్రం తెలిసిపోతుంది” అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
“నా నిర్ణయానికి అమ్మానాన్నలు ఎంతో గౌరవాన్ని ఇస్తుండేవారు. ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త జాగ్రత్తగా ఆలోచించి తీసుకో అని మాత్రమే చెప్పేవారు. అలా పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వడం చాలా ప్రధానం. మా అమ్మానాన్నలు నాపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేను కూడా చాలా కష్టపడ్డాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. ఈ రోజుకీ మేం ఇలా ఉన్నామంటే మా అమ్మ గారే కారణం” చిరంజీవి వెల్లడించారు.