తమ మానానికి రక్షణ కల్పించాలంటూ రోడ్డేక్కిన విద్యార్థినులు
ఒక మహిళా ఎమ్మెల్యే ఇలాకా, జిల్లా కేంద్రానికి అతి సమీపంలో దారుణ సంఘటనలు
అత్యున్నతమైన సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్ రూమ్ లో తొంగి చూస్తున్న అగంతకులు
నిద్రావస్తలో బుక్కరాసముద్రం పోలీసులు
గతంలో ఇలాంటి సంఘటనే జరిగినా పట్టించుకోని బుక్కరాయసముద్రం పోలీసులు
DGP, DIG లకు మెయిల్ ద్వారా పిర్యాదు చేసిన విద్యార్థినిలు
బాత్ తూముల్లోకి తొంగి చూస్తున్నరంటూ.. అమ్మాయిల ఆందోళన
* సెంట్రల్ యూనివర్సిటీలో కొనసాగుతున్న ఉద్రిక్తత
అనంతపురం
* బుక్కరాయసముద్రం మండలం జంతులూరులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కలకలం రేగింది.
* తమ బాత్ రూముల్లోకి అబ్బాయిలు తొంగి చూస్తున్నారని, తమకు రక్షణ లేదని అమ్మాయిలు ఆందోళనకు దిగారు.
* ఆదివారం రాత్రి బాగా పొద్దుపోయాక వారు ఆందోళనకు దిగారు.
* దీంతో విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
* వద్ద విద్యార్థునులు ఆందోళనకు దిగారు.
* క్యాంపస్ లో తమకు రక్షణ కరువైందని, తమ మాన, ప్రాణాలకు గ్యారంటీ లేకుండాపోయిందని విద్యార్థినులు గగ్గోలు పెడుతున్నారు
అర్ధరాత్రి ఒక మహిళ స్వేచ్ఛగా రోడ్డులో తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టని చెబుతుంటారు… కానీ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడుస్తున్నా.. ఒక మహిళ రోడ్డుపై నడవటం సంగతి అటు ఉంచితే ఒక అత్యున్నతమైన యూనివర్సిటీలో తమ వాష్ రూమ్ లో కూడా విద్యార్థినుల మానానికి భద్రత లేకుండా పోయింది. వినేందుకు ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. మన ఆంధ్రప్రదేశ్లో అది కూడా అనంతపురం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఒక మహిళ ఎమ్మెల్యే ఇలాకాలో విద్యార్థినుల మానానికి రక్షణ లేకుండా పోయింది. బుక్కరాయసముద్రం మండలంలోని సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. జంతులూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో గత కొన్ని రోజులుగా విద్యార్థినుల వాష్ రూమ్ లో ఉండగా గుర్తుతెలియని అగాంతకులు తొంగి చూస్తున్నారు. గతంలోనే ఈ సంఘటనను విద్యార్థులను గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అప్పట్లో బుక్కరాయసముద్రం పోలీసులు దీనిపై చాలా నిర్లక్ష్యంగా వహించారు. పైగా ఎమ్మెల్యే అయిన బండారు శ్రావణి యూనివర్సిటీకి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఇప్పటివరకు మహిళా ఎమ్మెల్యే ఆదేశాలకు లెక్కలేదు.. విద్యార్థులు అంతకంటే రక్షణ లేదు. బుక్కరాయసముద్రం పోలీసులు నిద్రపోతున్నారో లేక నిద్ర నటిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. తాజాగా ఆదివారం రాత్రి కూడా గుర్తు తెలియని అగాంతకులు వాష్ రూమ్ లో తొంగు చూస్తుండటాన్ని విద్యార్థినులు గమనించారు. వెంటనే కేకలు వేయగా. వారు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే విద్యార్థినిలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం రావడంతో అర్ధరాత్రి వేళ రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఒక సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినులకు రక్షణ లేకపోవడం ఏంటని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుక్కరాయసముద్రం పోలీసులపై గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక యూనివర్సిటీలో విద్యార్థినులకు ఇలాంటివి జరుగుతున్నా..ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.