కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది సీనియర్లను పట్టించుకోవటం లేదని వారికి కల్పించాల్సిన స్థానాలు వారికి ఇవ్వటం లేదు అంటూ కొంతమంది తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు కోసం తమ సీట్లను కూడా వదులుకోవాల్సి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పటికి తమని గుర్తించలేదంటూ కొంతమంది ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ పార్టీలు మారడానికి కూడా సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే కొంతమంది కీలక నేతలు పార్టీ వ్యవహారాలకు దూరంగా కూడా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వారిలో జేసీ పవన్ కూడా ఒకరు తాడిపత్రిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జేసీ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే టికెట్ ఒక ఎంపీ టికెట్ ఉండేది కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు కానీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి మాత్రం అనంతపురం ఎంపీగా టికెట్ ఇవ్వలేదు.
గత ఎన్నికలలో ఈయన అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి కూటమి పొత్తులో భాగంగా టికెట్ కూడా రాకపోవడంతో పవన్ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సింగనమల మాజీ మంత్రి సాకే శైలజనాథ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి అటే ముందుగా జేసీ పవన్ ను కలిశారు దీంతో శైలజనాథ్ బాటలోనే పవన్ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారనే వార్తలు హల్చల్ చేశాయి.
ఇలా తాను పార్టీ మారుతున్నాను అంటూ వస్తున్నటువంటి వార్తలపై జేసీ పవన్ స్పందించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నేను పార్టీ మారుతున్నానని వార్తలు వస్తున్నాయి అందులో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. శైలజనాథ్ నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన వైసీపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నారు అలా నిర్ణయం తీసుకున్న వారిని మనం ఏం చేయలేము అందుకే తనకు ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించానని వెల్లడించారు. తాను పార్టీ మారుతున్నాను అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఈయన ఈ వార్తలను ఖండించారు.
గత కొంతకాలంగా కూటమినేతలలో చాలామందికి అసహనం కనిపిస్తోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరి భవిష్యత్తు తెలిసిపోయిందని.. రాబోయే రోజుల్లో చాలామంది నేతలు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తాడిపత్రి పట్టు ఉన్నటువంటి చేసి కుటుంబ సభ్యులు జేసీ పవన్ రెడ్డి తన కుటుంబంతో సహా వేరే పార్టీలోకి మారబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్న తరుణంలో.. ఈ విషయం పైన అటు జెసి .పవన్ రెడ్డి క్లారిటీ ఇవ్వడం జరిగింది.
పార్టీ మారుతారనే ప్రచారం పైన.. జెసి పవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందులో ఎలాంటి నిజం లేదని ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదంటూ క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా వైసీపీ పార్టీలో చేరుతారని ప్రచారం కూడా జరుగుతోందని.. అంతేకాకుండా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి శైలజ నాథ్ కూడా పార్టీ మార్పు సమయంలో జెసి పవన్ రెడ్డిని కలవడంతో ఇదంతా కూడా నిజమే అనుకున్నారు..కానీ అందులో ఎలాంటి నిజము లేదని.. శైలజనాథ్ వైసీపీలో చేరుతానని నిర్ణయం తీసుకున్నారని.. తాను నిర్ణయం తీసుకున్న తర్వాత తాను ఏమి చేయలేనని కూడా తెలిపారట జెసి పవన్ రెడ్డి.. కేవలం ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించాను అంటూ తెలిపారట. అనంతపురం జిల్లాకి సుమారుగా 1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెండు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని దావోస్ పర్యటనలో భాగంగానే వీటిని కుదర్శగలిగాను అంటూ తెలియజేశారు జెసి పవన్.
మొత్తానికి టిడిపి నుంచి వైసీపీ పార్టీలోకి జెసి కుటుంబం వెళ్తుందని విషయం పైన ఎట్టకేలకు క్లారిటీ ఇవ్వడంతో అటు టిడిపి కార్యకర్తలు నేతలు కొంత మెరకు ఊపిరి పీల్చుకున్నారు. మరి వచ్చే ఎలక్షన్స్ నాటికి ఎవరెవరు ఏ పార్టీలో ఉంటారన్న విషయం చూడాలి మరి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పైన ప్రభుత్వ పథకాలు అందించలేదని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చాలా నెగిటివ్ గానే ఉన్నది. మరి ఈ నెగటివ్ ని పోగొట్టడానికి ఏన్నో పథకాలను అమలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. మరి ఏం జరుగుతుందో చూడాలి.