ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రాన్ని హనీ ట్రాప్ వ్యవహారం కుదిపేస్తోంది. కర్ణాటక రాజకీయ వర్గాలలో ఆందోళనకు కారణంగా మారింది. కర్ణాటక అసెంబ్లీలో హనీ ట్రాప్ వ్యవహారం పైన రేగిన దుమారం ఇప్పుడు రాజకీయ వర్గాలలో టెన్షన్ కు కారణంగా మారింది. కర్ణాటక కు చెందిన 48 మంది ఎమ్మెల్యేలు ఈ వలపు వలకు చిక్కినట్టు అసెంబ్లీలో ఒక మంత్రి ప్రకటించడం ప్రస్తుతం కలకలం రేపింది.
ఇటీవల ఇద్దరు మంత్రుల పైన హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని పిడబ్ల్యూడి మంత్రి సతీష్ జార్కిహోళీ ప్రకటించారు. అంతేకాదు ఈ హనీ ట్రాప్ కు సంబంధించి అభ్యంతరకరమైన వీడియోలు, సంభాషణలు, సిడిలు, పెన్ డ్రైవ్ లలో ఉన్నాయని చెప్పి ఆయన అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.
కర్ణాటక రాజకీయాల్లో ‘హనీ ట్రాప్’ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రులు సహా ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని కొందరు వలపు వల పన్నినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో జాతీయ స్థాయి నేతలు సహా దాదాపు 48 మంది రాజకీయ నాయకులు బాధితులుగా ఉన్నారంటూ రాష్ట్ర మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యులు దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేయడంతో ప్రభుత్వం విచారణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నేతలు హనీ ట్రాప్లో చిక్కుకున్నారని కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న అసెంబ్లీలో చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనకు తెలిసిన సమాచారం ప్రకారం.. కనీసం 48 మంది ఈ ఉచ్చులో చిక్కుకున్నారని ఆయన తెలిపారు. వారి అసభ్యకరమైన వీడియోలు సీడీలు, పెన్డ్రైవ్లలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారం కేవలం ఒక పార్టీకి మాత్రమే పరిమితం కాదని, అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా బాధితుల్లో ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని, దీని వెనుక ఎవరున్నారో తేలాలని, ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాలని మంత్రి రాజన్న అన్నారు.
ఈ అంశంపై స్పందించిన మంత్రి సతీశ్ జార్కిహోళీ మాట్లాడుతూ.. ఒక మంత్రిని రెండుసార్లు హనీ ట్రాప్ చేసే ప్రయత్నం జరిగిందని ధృవీకరించారు. అయితే ఇది రాష్ట్రానికి కొత్తేమీ కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు ఇలాంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. హనీ ట్రాప్నకు గురైన మంత్రి ఫిర్యాదు చేయాలని సూచించామని, ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
మరోవైపు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ఈ కేసులో ఎవరినైనా అరెస్టు చేశారా లేదా అనే విషయం తనకు తెలియదని చెప్పారు. దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి కర్ణాటక రాజకీయాల్లో ఈ హనీ ట్రాప్ వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
హనీ ట్రాప్ లో బాధితులలో అధికార పక్షం నేతలే కాదు విపక్ష సభ్యులు కూడా ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో సభలో తీవ్ర దుమారం రేగింది. దీనిపై విచారణ జరిపించాలని అధికార విపక్ష పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రకటించింది. ఇప్పుడు ప్రపంచాన్నే గజగజ వణికిస్తున్న హనీ ట్రాప్ కర్ణాటక రాష్ట్ర రాజకీయాలలో చర్చకు దారితీసింది.