పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, చిరంజీవి, సురేఖ అంతా సింగపూర్ లోనే ఉన్నారు. కుమారుడి ఆరోగ్యాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. కులదైవం అంజనేయస్వామి దయవల్ల పెద్ద ప్రమాదం నుంచి బిడ్డ బయటపట్టాడని చిరంజీవి కుదుట పడ్డారు. అయితే మార్క్ శంకర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుకు మరింత సమయం పడుతుంది.అయితే పవన్ ఇప్పుడు సింగపూర్ లో ఎన్ని రోజులు ఉంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన కేవలం నటుడి గానే ఉంటే? షూటింగ్ లు అన్ని పక్కనబెట్టేసి కోలుకునే వరకూ ఉండే అవకాశం ఉంటుం ది. కానీ పవన్ ఏపీలో డీప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఈ క్రమంలో కూటమిలో అతడి పాత్ర అత్యంత కీలకమైంది. పవన్ లేకపోతే ఎక్కడ పనులు అక్కడ స్థంబించిపోతాయి. ఈ నేపథ్యంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
మార్క్ శంకర్ ని ఇప్పటికిప్పుడు ఇండియాకు తరలించడం సాధ్యమవుతుందా? అంటే అది బిడ్డ ఆరోగ్యం మీద ఆధారపడి ఉటుంది. ఊపిరితిత్తుల్లో గాలి వెళ్లడంతోనే డ్యామేజ్ ఎక్కువగా జరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సమయంలో విమాన ప్రయాణం సాధ్యమేనా? సౌకర్యంగా ఉంటుందా? లేదా? అన్నది డాక్టర్ల సూచనల మేరకు నిర్ధారించాల్సి ఉంటుంది. అలాంటి అవకాశం ఉంటే ఉన్నపళంగా హైదరాబాద్ కి షిప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. హైదరాబాద్ లో ఉంటూ ఏపీలో రాజకీయం చేస్తూ కుటుం బంతో ఉండొచ్చు. కానీ మార్క్ శంకర్ చదువు సహా చాలా కాలంగా సింగపూర్ లోనే ఉంటున్నారు. అక్కడ వాతావరణానికి అలవాటు పడి ఉన్నారు. కొత్తగా హైదరాబాద్ కి షిప్ట్ అవ్వడం అంటే వాతావరణం మారు తుంది. సాంకేతికంగానూ కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసు కుంటారో చూడాలి.సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గాయాలు నుంచి కోలుకున్న మార్క్ శంకర్ ప్రస్తుతం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తోంది. అయితే మార్క్ శంకర్ హాస్పిటల్ ఖర్చులపై ప్రస్తుతం ఓ చర్చ నడుస్తోంది. మార్క్ శంకర్కు అందించిన వైద్యానికి లక్షల్లో ఖర్చు అయినట్టు అందరూ భావిస్తున్నారు.
స్కూల్లో జరిగిన ప్రమాదంలో మార్క్ చేతులకు, కాళ్లకు చిన్నపాటి గాయాలు కావడంతో దట్టమైన నల్లటి పొగ పీల్చినట్టు వైద్యులు చెబుతున్నారు. దీని కోసం వైద్యులు బ్రోన్కో స్కోపీ అనే ట్రీట్మెంట్ని మార్క్ శంకర్కి అందించినట్టు తెలుస్తోంది. ఇదేదో కొత్త ట్రీమ్మెంట్లా ఉంది దీనికి ఎన్ని లక్షలు ఖర్చు అయ్యుంటాయో అనుకుంటున్నారేమో కాదా..కానీ ఈ ట్రీట్ మెంట్కు అయిన ఖర్చు ఎంతో తెలుస్తే మీరు షాక్ అవుతారు.ఈ బ్రోన్కో స్కోపీ ట్రీట్మెంట్కు అందించేందుకు కేవలం రూ.4 వేల నుండి 30 వేలు మాత్రమే వైద్యులు ఛార్జ్ చేస్తారంటా. అసలు ఈ ట్రీట్ మెంట్ ఎందుకు చేస్తారంటే. పేషెంట్ ఏవైన విషవాయువులు పీల్చుకొని అవి లంగ్స్ లోకి చేరితే ..వాటిని తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్ ని అందించేందుకు ఈ ట్రీట్మెంట్ చేస్తారట. అయితే ప్రమాదం జరిగిన 30 నిమిషాల లోపే ఈ ట్రీట్మెంట్ అందించాలని.. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే స్కూల్లో జరిగిన ప్రమాదంలో మార్క్ శంకర్ నల్లటి పొగను పీల్చారని దాన్ని తొలగించేందుకు ఈ ట్రీట్మెంట్ అందింనట్టు తెలుస్తోంది.
ఇక తన కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ బయల్దేరి వెళ్లారు. హాస్పిటల్లో ఉన్న మార్క్ శంకర్ను చూసి. అక్కడి వైద్యులతోనే మాట్లాడారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా సింగపూర్ వెళ్లారు. ప్రస్తుతం ఇద్దరూ సింగపూర్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. మార్క్ శంకర్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో అతన్ని హైదరాబాద్ తీసుకురావడానికి మరో రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.