ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీపై వివాదం ఆగట్లేదు. అధికార, విపక్షాల మధ్య నాన్స్టాప్గా డైలాగులు పేలుతున్నాయి. రామగిరిలో మొదలైన రచ్చ రోజురోజుకు రాజుకుంటోంది. రాజకీయంగా సెగలు రాజేస్తోంది. చూస్తుంటే గల్లీ నుంచి ఢిల్లీకి పాకేలా ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరిలో జగన్ టూర్ సందర్భంగా భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ను చూడడానికి జనం భారీగా తరలిరావడంతో, ఆ తాకిడికి హెలికాప్టర్ విండ్ షీల్డ్ డ్యామేజ్ అయింది. దీంతో జగన్ బెంగళూరుకు కారులో వెళ్లిపోయారు.
నేర స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎవరికి భద్రత కావాలి?భద్రత కావలసింది జగన్ కు కాదు. జగన్ నుండి రాష్ట్రానికి, ప్రజలకు భద్రత కావాలి.ప్రజలంతా జగన్ నుండి మాకు భద్రత కావాలని మొన్నటి ఎన్నికల్లోనే స్పష్టమైన తీర్పు ఇచ్చారు.సీఎం చంద్రబాబు సైతం తన పర్యటనల్లోనే పరదాలు వద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఆంక్షలు వద్దు అని , తన భద్రత కూడా తగ్గించుకున్నారు.జగన్ కు మాత్రం 1100 మందితో భద్రత కల్పిస్తే అదికూడా సరిపోదంటున్నాడు.పరామర్శకు వెళ్తున్నారా ? బల ప్రదర్శనకు వెళ్తున్నారా ?డబ్బులు పంచిపెట్టి హెలికాఫ్టర్ దగ్గరకు జనసమీకరణ చేయాల్సిన అవసరం ఏంటి?హెలికాఫ్టర్ దగ్గరకు అంతమంది వైసీపీ కార్యకర్తలు, నాయకులను తీసుకురావడం, వాళ్ళే మీ మీద దాడి చేశారని చెప్పడం దేనికి సంకేతం.హెలికాఫ్టర్ దగ్గర 250 మంది పోలీసులను భద్రత పెడితే , భద్రత లేదు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ముందే ఎలా సర్క్యులేట్ చేశారు.గతంలోనూ కోడి కత్తి, గులకరాయు , గొడ్డలి పోటును, గుండె పోటుగా మార్చిన డ్రామాలు చూశాం.హెలికాఫ్టర్ మీద దాడి చేశారని అంటున్నారు, గంటన్నర్ర వ్యవధిలోనే హెలికాఫ్టర్ ఎలా వెళ్ళిపోయింది.
జగన్ డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.గతంలో మీ పాలనలో చంద్రబాబు పర్యటన ఉంటే చాలు, 30 యాక్ట్, ముందస్తు అరెస్టులు , హౌస్ అరెస్టులు అంటూ, ఉదయాన్నే సాక్షి పేపర్ కంటే ముందే మా ఇళ్ల మీదకు వచ్చి అరెస్టులు చేసేవారు.
అమరావతి, నందిగామ , ఎర్రగుంట్ల , పుంగనూరులో చంద్రబాబు పై దాడి చేశారు.కుప్పం వెళ్లడానికి కూడా చంద్రబాబు ను అడ్డుకుంటే, కాలి నడకన వెళ్ళారు.నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.అమరావతి రైతులు పాదయాత్ర చేపడితే అరెస్టులు చేశారు.కూటమి ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని ఎక్కడైనా అడ్డుకున్నామా ?మీకు నచ్చిన చోట మీటింగులు పెట్టుకుంటున్నారు, సభలు పెట్టుకుంటున్నారు, మిమ్మల్ని ఎక్కడైనా అరెస్టులు చేశామా?వైసీపీ మాజీ మంత్రి మాట్లాడుతూ గుంటూరు ఇవతల, అవతల జనాల్ని ఇంట్లో నుండి లాక్కొచ్చి నరుకుతాం అంటున్నారు.అధికారంపోతే హింస, అరాచకం, పెంచి పోషిస్తున్నారు.మీరు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కాదు కలవాల్సింది, సీబీఐ కేసుల వాయుదాలకు హాజరవ్వాలి.ప్రధాని మోదీ సాయంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టాలని చూస్తుంటే , జగన్ రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చుతున్నాడు.