రష్మిక మందన్న ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన ఈమె అతి తక్కువ సమయంలోనే తెలుగులో కూడా అవకాశాలను అందుకున్నారు. ఇక తెలుగులో వరుస సక్సెస్ లతో దూసుకుపోతూ పాన్ ఇండియా స్థాయిలో కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా రష్మికకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రావడంతో ఈమెకు బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు మరోవైపు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా రష్మిక నటన పరంగా ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు. తాజాగా మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నారు.
ఇక ఇలాంటి రికార్డు సృష్టించిన మొట్టమొదటి హీరోయిన్గా రష్మిక నిలవటం విశేషం. ఇటీవల రష్మిక నటించిన యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే ఈ మూడు సినిమాలు వరుసగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది . ఇప్పటివరకు ఏ హీరోయిన్ విషయంలో కూడా ఇలా జరగలేదని ఇలాంటి ఘనత సాధించిన మొట్టమొదటి హీరోయిన్గా రష్మిక గుర్తింపు పొందారు.
యానిమల్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.556.36 కోట్లు వసూలు చేసింది. ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ 830 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు ఛావా రూ.516 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈమెయిల్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి సికిందర్ అనే సినిమాలో నటిస్తున్నారు . మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ రష్మిక కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు గుడ్ టైం నడుస్తోంది. ఆమె ఏది పట్టుకున్నా బంగారంగా మారుతోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఎవరికీ లేని విధంగా మూడేళ్లలో .. మూడు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు కొట్టి ఏకంగా రూ.3500 కోట్ల కలెక్షన్స్తో రికార్డు సృష్టించారు.